GHMC కార్మికులపై రాళ్లు, ఇటుకలతో దాడి (వీడియో)

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో జీహెచ్‌ఎంసీ కార్మికులపై కొబ్బరిబోండాల వ్యాపారులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Update: 2024-03-30 03:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో జీహెచ్‌ఎంసీ కార్మికులపై కొబ్బరిబోండాల వ్యాపారులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా ఇవాళ ఉదయం GHMC సిబ్బంది క్లీనింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ - సులేమాన్ నగర్ పరిధిలో ప్రధాన రహదారిపై ఫుట్‌పాత్ మీద కొబ్బరి బోండాలు అమ్మొద్దని అక్కడున్న వ్యాపారికి చెప్పారు. వినకపోవడంతో అమ్ముతున్న వారిని GHMC ఎన్‌ఫొర్స్‌మెంట్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సదరు వ్యాపారి GHMC సిబ్బందిపై తన అనుచరులతో కలిసి విచక్షణారహితంగా ఇటుకలతో, రాళ్లతో తలపై దాడి చేశారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News