రాష్ట్రంలో పోలింగ్ టైమ్ పెంచడంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో పోలింగ్ సమయం మార్పుపై గెజిట్ విడుదల అయింది.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో పోలింగ్ సమయం మార్పుపై గెజిట్ విడుదల అయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 17 లోక్సభ స్థానాల పరిధిలో కొత్త సమయం అమలు చేసేందుకు గెజిట్ ను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల దృష్ట్యా పోలింగ్ సమయం పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల వినతుల దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఈసీ పెంచింది.