టెన్త్ పూర్తయిన విద్యార్థులకు గుడ్ న్యూస్

పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఐఐటీ, నీట్‌లో అర్హత సాధించాలని, అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఉచితంగా అవగాహన

Update: 2023-05-06 16:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఐఐటీ, నీట్‌లో అర్హత సాధించాలని, అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఉచితంగా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు మెటా మైండ్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ క్లాసులు కొనసాగుతాయని శనివారం వెల్లడించారు.

ఈ శిక్షణ తరగతుల్లో సిలబస్, పరీక్ష విధానం, మెంటర్ షిప్, టెస్ట్ సిరీస్, ఒత్తిడిని జయించడం, రైటింగ్ స్కిల్స్, టైం మేనేజ్ మెంట్ వంటి అంశాలపై ఉచిత క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఉచిత ఐఐటీ, నీట్ తరగతుల పోస్టర్ ను టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా ఉచిత రిజిస్ట్రేషన్, హాస్టల్ వసతి కోసం 8522958575, 7032264910 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Tags:    

Similar News