కంటతడి పెట్టిన మాజీ మంత్రి మోత్కుపల్లి.. కారణమిదే..!
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు.
దిశ, వెబ్డెస్క్: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. తనకు టికెట్ రాకుండా సీఎం కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బయట నుంచి వచ్చిన వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని వాపోయారు. కనీసం ఒక్క టికెట్ అయినా మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను చాలా మంది సీఎంలతో కలిసి పనిచేశానని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. పథకాలను చూసి జనం ఓట్లు వేయరన్నారు. తాను చస్తేనే మాదిగలకు టికెట్ ఇస్తారా అని ఫైర్ అయ్యారు. ఇదే తన చివరి ప్రెస్ మీట్ అన్నారు.