HYD : డ్రగ్స్తో పట్టుబడ్డ మాజీ CM మనవడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కలకలంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
దిశ, రాచకొండ : రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కలకలంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్ న్యాబ్, ఎస్ఓటీ మాదాపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో రాడి సన్ హోటల్లో ఆదివారం రాత్రి సోదాలు జరిగాయి. అయితే బీజేపీ నాయకుడు యోగానంద్ కుమారుడు వివేకానంద హోటల్లో గది అద్దెకు తీసుకుని వీకెండ్లో డ్రగ్స్ పార్టీలను అరెంజ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆదివారం కూడా వివేకానందతో మొత్తం 9 మంది ఈ పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే సోదాలు అందరు వెళ్ళిపోయినా తర్వాత జరగడంతో వివేకానంద ఒక్కడు పోలీసులకు చిక్కారు. అతనిని విచారించినప్పుడు మొత్తం 9 మంది ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు వారందరిని విచారించునున్నారు. మిగతా 8 మంది మొత్తం హై ప్రొఫైల్కు చెందిన వారే ఉన్నట్లు తెలిసింది. వివేకానందకు హైదరాబాద్కు చెందిన అబ్బాస్ నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. వీటిని నిర్ధారించుకోవడానికి టీఎస్ న్యాబ్, ఎస్ఓటీ మాదాపూర్, గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.