ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశ, వెబ్డెస్క్: సంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులను మునావర్, ఫాతిమాగా పోలీసులు గుర్తించారు. కర్నాటక నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.