ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అన్నదమ్ముల దుర్మరణం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2023-05-24 07:27 GMT

దిశ, అక్కన్నపేట: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నదమ్ములు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి గ్రామానికి అన్నదమ్ములు నలుగురు మృతి చెందారు. మృతులను ఎరుకల, కృష్ణ, సంజీవ్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా కొన్నెళ్ల క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని సూరత్ వెళ్లారు.

ఐదు రోజుల క్రితం వీరి గ్రామంలో బంధువు మృతిచెందగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కుటుంబ సభ్యులను చౌటపల్లీలో ఉంచి, అన్నదమ్ములు తిరిగి కారులో సూరత్ వెళుతుండగా కార్ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. నలుగురు అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Tags:    

Similar News