సివిల్స్ టాపర్ అనన్య రెడ్డి పేరుతో ఫేక్ ఐడిలు..సైబర్ క్రైమ్ పీఎస్ లో కంప్లైంట్

సైబర్ క్రిమినల్స్ సివిల్స్ టాపర్ అనన్య రెడ్డి ని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌లకు రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశారు.

Update: 2024-04-30 16:14 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: సైబర్ క్రిమినల్స్ సివిల్స్ టాపర్ అనన్య రెడ్డి ని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌లకు రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టాగ్రాం, ట్విట్టర్, టెలిగ్రామ్ ఇంకా ఇతర సోషల్ మీడియా వేదికల మీద తన పేరు మీద ఫేక్ అకౌంట్ తెరిచి అమాయకులను మోసం చేస్తున్నారని ఫిర్యాదు లో తెలిపారు. కొన్ని చానెల్స్ ఆమె సివిల్స్ ఆశావాహులకు మెంటర్‌షిప్ చేస్తుందని ప్రచారం చేస్తున్నారని, డబులు కూడా వసూలు చేస్తున్నారని పోలీసులకు తెలిపింది. ఇలా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సివిల్స్ లో 3 వ ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి తన ఫిర్యాదు ద్వారా పోలీస్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఫిర్యాదు ఫై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News