కేసీఆర్‌ను మళ్లీ పులితో పోల్చిన మల్లారెడ్డి.. సమయం ఆసన్నమైందంటూ కీలక వ్యాఖ్యలు

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితిపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు.

Update: 2024-01-21 08:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితిపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అడ్డా అని అన్నారు. అతి త్వరలో పులి(కేసీఆర్) బయటకు వస్తుంది.. ఆట మొదలు పెడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మర్చిపోయి కాంగ్రెస్‌కు ఓటేశారని అన్నారు. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరుగదని కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. పదేళ్ల తర్వాత ప్రజలు ఒక చాన్స్ ఇచ్చినా కాంగ్రెస్‌ నేతలు నిలుపుకోలేకపోయారని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్‌ గెలుచుకుంటుందని మల్లారెడ్డి జోస్యం చెప్పారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News