బీఆర్ఎస్ ఓడినా.. వారి వ్యవహార శైలిలో మార్పు రాలేదు.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఓడినా.. వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదని, ఇంకా వారిలో నియంతృత్వ ధోరణే స్పష్టం కనిపిస్తుందిని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

Update: 2024-01-04 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ ఓడినా.. వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదని, ఇంకా వారిలో నియంతృత్వ ధోరణే స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇవాళ ఆయన గాంధీ‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నవ్విపోదురు గాక అన్నట్లుగా ఉంది బీఆర్ఎస్ తీరని ఎద్దేవా చేశారు. 3550 రోజుల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 35 రోజులు కూడా కాలేదని అప్పుడే తామిచ్చిన హామీలపై బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే ఇచ్చిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ లోపే ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.  

Tags:    

Similar News