ముగిసిన Bandi Sanjay 5వ విడత పాదయాత్ర

18వ రోజు దిగ్విజయంగా కొనసాగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది.

Update: 2022-12-15 09:55 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: 18వ రోజు దిగ్విజయంగా కొనసాగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్ర బృందం కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీకి చేరుకున్నది. కాగా, చివరి రోజున బండి సంజయ్‌కి బీజేపీ శ్రేణులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. యాత్ర సాగినన్ని రోజులు 'జై బీజేపీ.. జై బండి సంజయ్' అనే నినాదాలతో కరీంనగర్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలు, కోలాటాల మధ్య ఐదో విడత యాత్ర సందడిగా సాగింది. ఈ విడత యాత్ర కేడర్‌లో ఫుల్ జోష్ నింపినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

Also Read...

సిరిసిల్లలో బీఆర్ఎస్ షాక్.. బీజేపీలో చేరిన సెస్ మాజీ చైర్మన్ 

Tags:    

Similar News