భద్రాద్రి రాములోరి కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి గ్రీన్ సిగ్నల్

శ్రీరామ నవమి వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాములవారి కల్యాణం లైవ్ టెలీకాస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Update: 2024-04-16 15:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాములవారి కల్యాణం లైవ్ టెలీకాస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, ఇటీవల భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారంపై ఈసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి వీళ్లేదని సూచించింది. దీంతో ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఈవోకు లేఖ రాసింది. దాదాపు 40 ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని.. ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో కొండా సురేఖ కోరారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించకుండా జరుపుకోవాలని తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News