పోలీసు శాఖలో పలు సంస్కరణలు.. డీజీపీ అంజనీ కుమార్

పోలీసు శాఖలో పలు సంస్కరణలు ప్రవేశ పెట్టినట్టు డీజీపీ అంజనీ కుమార్​ చెప్పారు.

Update: 2023-08-14 16:46 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత పోలీసుశాఖలో పలు సంస్కరణలు ప్రవేశ పెట్టినట్టు డీజీపీ అంజనీ కుమార్​ చెప్పారు. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ శాంతి భద్రతలను కాపాడటంలో గణనీయమైన ఫలితాలను సాధిస్తున్నట్టు తెలిపారు. ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు రాధికా గుప్తా, డాక్టర్​ పి.శ్రీజ, ఫైజాన్ అహమద్, పీ.గౌతమి, పింకేశ్​ కుమార్, లెనిన్ వత్సల్ టొప్పో, శివేంద్రు ప్రతాప్, సంచిత్ గంగ్వార్లు సోమవారం డీజీపీ అంజనీకుమార్​ ను ఆయన కార్యాలయంలో కలిశారు. నేరాలకు కళ్లెం వేయటానికి తీసుకుంటున్న చర్యలతో పాటు పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి డీజీపీ తెలియచేశారు. 

Tags:    

Similar News