సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ రక్షణశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2023-03-17 11:21 GMT

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సికింద్రాబాద్ సహా దేశంలోని అన్ని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను వాయిదా వేస్తూ రక్షణశాఖ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి-17న విడుదల చేసిన నోటిఫికేషను రక్షణశాఖ రద్దు చేసింది. కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు రక్షణశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.



 


Tags:    

Similar News