CM రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిండిన చెరువులోకి కప్పలు వెళ్లినట్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ వదిలి హస్తం పార్టీలోకి వెళ్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ ఆత్మగౌరవం గుర్తు రాలేదన్నారు. బీఆర్ఎస్ వీడాక దానం నాగేందర్కు ఆత్మగౌరవం గుర్తు వస్తుందా అని ప్రశ్నించారు. గతంలో రూ.వంద కోట్ల తన ఇంటిని కేసీఆర్కు నాగేందర్ ఇస్తానన్నారని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఏం మారిందో దానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లో దానం నాగేందర్ ఓటమికి అర్హుడన్నారు. పార్టీ వీడే వారు పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్లాలన్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు పడుతుందన్నారు. 2015లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డిపై 2015లోనే రాజద్రోహం కేసు పెట్టాల్సిందని తెలిపారు.