నేడు ఈడీ విచారణకు కాంగ్రెస్ కీలక నేత

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.

Update: 2023-05-31 03:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు నేడు అంజన్ కుమార్ యాదవ్ హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా అంజన్ కుమార్ గతేడాది నవంబర్‌లో ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఓ చారిటీ సంస్థకు విరాళం ఇచ్చారు. ఆ విరాళంపైనే ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.  

Tags:    

Similar News