'ఎంపీ సంతోష్ కనబడడం లేదు.. వెంటనే కనిపెట్టండి'

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు ఆచూకీ కోసం ఆయన సొంత మండలంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. సంతోష్ రావును కనుగొనాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల

Update: 2022-09-29 07:34 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు ఆచూకీ కోసం ఆయన సొంత మండలంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. సంతోష్ రావును కనుగొనాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముంపు గ్రామాల బాధిత సంఘం అధ్యక్షుడు కూస రవిందర్ ఈ మేరకు పోలీసులు దరఖాస్తు చేశారు. వెన్నమనేని శ్రీనివాస్ రావును ఈడీ విచారించినప్పటి నుండి సంతోష్ రావు కనపడడం లేదని మీడియాలో వస్తున్న నేపథ్యంలో ఆయన ఆచూకీ దొరకబట్టాలని కోరారు. బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన సంతోష్ రావు కనిపించకపోవడం తమలో ఆందోళన కల్గిస్తున్నదన్నారు.

Tags:    

Similar News