ఛత్తీస్గఢ్ కాంకేర్లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్.. దండకారణ్యంలో హైటెన్షన్!
ఛత్తీస్ గఢ్ కాంకేర్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్ గఢ్ కాంకేర్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ‘ఆపరేషన్ అబుజ్మడ్’ను భద్రతా బలగాలు భారీగా చేపట్టాయి. అడవిని వందలాది మంది బీఎస్ఎఫ్ జవాన్లు జల్లెడపడుతున్నారు. ఎన్ కౌంటర్ స్పాట్లో మొత్తం 70 మంది మావోయిస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 40 మందికి పైగా మావోయిస్టులు పారిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మిగతా మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ అలర్ట్గా ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలపారు. ఛోటే బైటియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించి తాజాగా ఎన్ కౌంటర్ చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.