భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మార్చబోతున్నారు: CM రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్

బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశం

Update: 2024-04-27 12:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 100 ఏళ్లలో భారత్‌ను హిందూ రాజ్యంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ 1925లోనే ప్రతిజ్ఞ చేసిందని.. అందులో భాగంగానే 2025 నాటికి భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మార్చబోతున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని.. అందులో భాగంగానే 400 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 2/3 మెజార్టీతో రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలన్నదే బీజేపీ అసలు ఉద్దేశమని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు తీసేయడమే బీజేపీ టార్గెట్ అన్నారు.

భారత్‌ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చడమే బీజేపీ లక్ష్యమని.. బీసీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చెయ్యబోతుందని.. అందుకే ఈ ఎన్నికలను వేదిక చేసుకుని బీజేపీ 400 సీట్లు అంటోందని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కుట్రను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. దేశ జనాబా దామాషా ప్రకారం బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. లోక సభ ఎన్నికల్లో అక్రమంగా, దౌర్జన్యంగా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని వ్యవస్థలు, సంస్థలను వాడుకుని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Similar News