కేసీఆర్.. జీవితంలో ఇక సీఎం కాలేవు: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ పదేళ్లు ఏం చేశారో చెప్పకుండా.. నాలుగు నెలల్లోనే మనం ఏం చేయట్లేదంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్

Update: 2024-04-30 15:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ పదేళ్లు ఏం చేశారో చెప్పకుండా.. నాలుగు నెలల్లోనే మనం ఏం చేయట్లేదంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని బడంగల్ పేట్‌లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ జీవితంలో ఇక సీఎం కాలేడని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని.. ఇక తిరిగి రాదని సీఎం సెటైర్ వేశారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. డిసెంబర్‌లో జరిగిన సెమీ ఫెనల్స్‌ ఎన్నికల్లో గెలిచామన్నారు.

సెమీస్‌లో బీఆర్ఎస్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చామని.. ఇక ఫైనల్‌లో బీజేపీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని.. సబితా ఇంద్రారెడ్డి ఉదయం బీఆర్ఎస్.. సాయంత్రం బీజేపీ అంటున్నారని ఎద్దేవా చేశారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశర్ రెడ్డి రాజకీయాలను కూడా వ్యాపారంగా చూస్తున్నారని.. ఆయనకు ప్రజలు ఎవరూ ఓటు వేయరని అన్నారు. కొండా విశ్వేశర్ రెడ్డి యూపీ లేదా బీహార్ నుండి రాజ్య సభకు వెళ్లాలని రేవంత్ సూచించారు. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News