UPSC టాపర్‌ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి

యూపీఎస్సీ సివిల్స్-2023 ఫలితాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచిన దోనూరి అనన్య రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

Update: 2024-04-20 09:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీ సివిల్స్-2023 ఫలితాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచిన దోనూరి అనన్య రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఆమె కుటుబం సభ్యులతో కలిసి వెళ్ళింది. ఈ సందర్భంగా ఆమెను సీఎం రేవంత్ రెడ్డి అభినందించి.. పుష్పగుచ్చం అందజేసి.. శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఉన్నారు.

Tags:    

Similar News