కరీంనగర్ ప్రజలపై సీఎం రేవంత్ ప్రశంసల వర్షం
కరీంనగర్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మంగళవారం జమ్మికుంటలో జనజాతర
దిశ, వెబ్డెస్క్: కరీంనగర్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మంగళవారం జమ్మికుంటలో జనజాతర పేరిట బహిరంగా సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైందని.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ ఊపిరి ఊదిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక భూమిక పోషించారని కొనియాడారు. ఉద్యమ సమయంలో కరీంనగర్ ప్రజలు కేసీఆర్కు అండగా ఉన్న.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఈ జిల్లాను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షనస్ సెమీ ఫైనల్ అని.. సెమీస్లో కేసీఆర్ను చిత్తుచిత్తుగా ఓడించారు.. ఇప్పుడు ఫైనల్లో ప్రధాని మోడీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని అన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదేళ్లలో కేంద్రం నుండి తెలంగాణకు తెచ్చిందేమి లేదని విమర్శించారు. కరీంగర్ కాంగ్రెస్అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.