దుగ్గొండికి చేరుకున్న సీఎం కేసీఆర్..

అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను గురువారం ఉదయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు.

Update: 2023-03-23 09:49 GMT

దిశ, నర్సంపేట: అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను గురువారం ఉదయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామంలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడారు. నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నష్ట పోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10000/- చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.



 


Tags:    

Similar News