దుమారం రేపుతోన్న రేవంత్ కామెంట్స్.. డీజీపీకి ఫిర్యాదు చేసిన BRS ఎమ్మెల్సీలు

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

Update: 2023-02-08 12:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు డైనమైట్‌లు పెట్టిపెల్చేయాలన్న రేవంత్ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్‌ రావు, ఎల్‌.రమణ, తాతా మధు, శంభీపూర్‌ రాజు, దండె విఠల్‌ కలిసి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిన్న రేవంత్‌‌రెడ్డి పాదయాత్రలో ప్రగతిభవన్‌ను గ్రైనైడ్స్‌ పెట్టి పేల్చి వేయాలన్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టసభల్లో సభ్యుడిగా ఉండి అధికార భవనాలను కూల్చివేయాల్సిందిగా కోరడమంటే, ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేక చర్యగా భావించాలని అన్నారు. రేవంత్‌ ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డీజీపీని కోరారు.

Tags:    

Similar News