సాయిచంద్ మరణం తీవ్రంగా కలచివేసింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Update: 2023-06-29 04:35 GMT

దిశ, వెబ్ డెస్క్: గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు సాయిచంద్ అని కవిత కొనియాడారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికరమని అన్నారు. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. 

Tags:    

Similar News