BREAKING: పది పరీక్ష రాస్తుండగా ఊడిపడిన పైకప్పు.. విద్యార్థి, ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఇవాళ ఘోరం చోటుచేసుకుంది.

Update: 2024-03-19 10:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఇవాళ ఘోరం చోటుచేసుకుంది. జైనథ్ మండల పరిధిలోని గిమ్మ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ విద్యార్థులు పరీక్ష రాస్తుండగా ఉన్నట్టుండి తరగతి గది పైకప్పు ఒక్కసారిగా ఊడిపడింది. ఈ ప్రమాదంలో పరీక్ష రాస్తున్న విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడికి కూడా తీవ్ర గాయలయ్యాయి. గమనించిన తోటి సిబ్బంది వారిద్దరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రకి తరలించారు.

Tags:    

Similar News