BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-04-25 01:46 GMT

దిశ, కోదాడ : ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన సంఘటనలో ఆరుగురు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపునకు వెళ్తున్న కారు శ్రీరంగాపురం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న కారు ముకుందాపురం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు నవ దంపతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదాలకు కారణమవుతున్న లారీలను జాతీయ రహదారి వెంట ఆపవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ లారీ యజమానులు డ్రైవర్లు అవేమీ పట్టించుకోకుండా దర్జాగా రహదారి పక్కన ఆపి పలువురు ప్రాణాలను బలి కొంటున్నారు.

Similar News