BREAKING: యాదాద్రి జిల్లా టేకులసోమారం పత్తి గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో నష్టం

యాదాద్రి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకులసోమారంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-03-04 16:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకులసోమారంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోదాముల్లో నిల్వ ఉంచిన పత్తికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలు ఎగసిపడుతుండటంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు మూడు ఫైరింజన్లతో దాదాపు రెండు గంటల నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఐదు బేళ్లకు పైగా పత్తి పూర్తిగా దగ్ధమైంది. అయినా, ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రూ.కోట్లలోనే నష్టం వాటిల్లిందంటూ బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరో నాలుగు గోదాముల్లో పత్తి నిల్వ ఉంచినట్లుగా సమాచారం.  

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News