BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితపై మరో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

Update: 2024-05-10 14:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఆమె కేసులో ప్రధాన నిందితురాలంటూ ఆ ఛార్జిషీట్‌‌లో పేర్కొంది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఛార్జీషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, ఛన్‌ప్రీత్‌ సింగ్‌, దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అర్వింద్‌‌ సింగ్‌ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు గత సోమవారం కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ, దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News