BREAKING: దళితులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కడియందే: ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు

ఫేక్ ఎన్‌‌కౌంటర్ల పేరుతో దళితును పొట్టన పెట్టుకున్న చరిత్ర కడియం శ్రీహరిదని వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-07 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫేక్ ఎన్‌‌కౌంటర్ల పేరుతో దళితును పొట్టన పెట్టుకున్న చరిత్ర కడియం శ్రీహరిదని వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దళితుల పేరు చెప్పుకుని రాజకీయాల్లో అత్యంత ఉన్నత పదవులు అనుభవించని వ్యక్తి కడియం శ్రీహరి అని ఆరోపించారు. ఆయనో మేకవన్నే పులి అని ఫైర్ అయ్యారు. ఫేక్ ఎన్‌కౌంటర్ల పేరుతో దళితులను ఎన్‌కౌంటర్ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎగిరేది కాషాయ జెండాయేనని పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తోంది శ్రీహరేనా లేక ఆయన కూతురా అన్న సందేహం ప్రజలకు కూడా కలుగుతోందని ఎద్దేవా చేశారు. వరంగల్‌కు నేను తాను పక్కా లోకల్ క్యాండిడేట్ అని.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గుంటూరుకు చెందన వారని ధ్వజమెత్తారు. వరంగల్లో ఆంధ్రోళ్ల పెత్తనం మనకు అవసరమా అని ఆరూరి రమేష్ అన్నారు. అసలు కడియం శ్రీహరి కులం ఏంటి అనేదానికి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో ఎంక్వయిరీ చేయించి నిజ నిర్ధారణ చేసి నిజమైన దళితులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. 

Tags:    

Similar News