BREAKING: నిజామాబాద్ పసుపునకు ఆల్‌టైం రికార్డు ధర.. క్వింటాకు ఏకంగా ఎంతంటే?

నిజామాబాద్ పసుపునకు బహిరంగ మార్కెట్‌లో ఎన్నడూ లేనంతగా ఆల్ టైం రికార్డు ధర పలికింది.

Update: 2024-03-14 06:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ పసుపునకు బహిరంగ మార్కెట్‌లో ఎన్నడూ లేనంతగా ఆల్ టైం రికార్డు ధర పలికింది. నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్ గ్రామానికి చెందిన రైతు తన పంటను మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అతడికి అక్కడి మార్కెట్ సిబ్బంది సదరు రైతు పసుపు పంటకు క్వింటాకు రూ.20,120 ధరను చెల్లించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్వింటా పసుపు పంటకు అంత ధర పలకడం ఇదే ప్రధమమని వ్యవసాయ అధికారులు తెలిపారు.  

Tags:    

Similar News