BREAKING: మోదీ పాలనలో అదానీ, అంబానీ సంపద మాత్రమే పెరిగింది: ప్రొఫెసర్ కోదండరాం

ప్రధాని మోడీ పాలనలో నిరుపేదల బతుకులు మారలేదని, కేవలం అదానీ, అంబానీ సంపద మాత్రమే పెరిగిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

Update: 2024-04-23 12:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ పాలనలో నిరుపేదల బతుకులు మారలేదని, కేవలం అదానీ, అంబానీ సంపద మాత్రమే పెరిగిందని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఇవాళ నాగర్‌ కర్నూల్ జిల్లా బిజినేపల్లి జన జాతర సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలిచాకే రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని అన్నారు. పదేళ్లే బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులు వంచనకు గురయ్యారని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం అనేక మంది ఉద్యమకారులపై కేసీఆర్ అక్రమ కేసులు బనాయించి హింసించారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నడైనా ఒక్కటేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే కొన్నింటిని అమలు చేశారని, రాబోయే రోజుల్లో మిగతా వాటిని కూడా సమర్థవంతంగా అమలు చేస్తారని కోదండరాం తెలిపారు. 

Tags:    

Similar News