BREAKING: జమ్మికుంట తహసీల్దార్ ఇంటిపై ఏసీబీ దాడులు.. కొనసాగుతున్న సోదాలు

ఏసీబీ అధికారులు మరో‌సారి తమ పంజా విసిరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ ఏసీబీ అధికారులు జమ్మికుంట తహసీల్దార్ రజని ఇంట్లో సోదలు చేపడుతున్నారు.

Update: 2024-03-13 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ అధికారులు మరో‌సారి తమ పంజా విసిరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ ఏసీబీ అధికారులు జమ్మికుంట తహసీల్దార్ రజని ఇంట్లో సోదలు చేపడుతున్నారు. ఈ మేరకు పట్టణంలో ఆమె ఇంట్లో ప్రస్తుతం రెయిడ్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న రజని దగ్గర బంధువుల ఇళ్లలో కూడా ఏక కాలంలో సోదాలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు ఎంత డబ్బును కనుగొన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News