‘పట్టభద్రుల MLC పోలింగ్ రోజు సెలవివ్వండి’
రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఈనెల 27న జరగనుంది. ఈనేపథ్యంలో పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని కేంద్ర
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఈనెల 27న జరగనుంది. ఈనేపథ్యంలో పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రంలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి బుధవారం లేఖ రాశారు. ఈ పోలింగ్కు 4,68,000 మంది ఓటర్లు ఎన్ రోల్ చేసుకున్నారని, అందుకే సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.