సస్పెన్షన్ ఘటనలో 106 మంది ఉద్యోగులకు బిగ్ రిలీఫ్

సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారని 106 మంది ఐకేపీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-04-19 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారని 106 మంది ఐకేపీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సస్పెషన్‌పై హై కోర్టు స్టే విధించింది. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులను హై కోర్టు జారీ చేసింది.  

Similar News