రాముడి పేరు వింటే ఆ రెండు పార్టీలకు వెన్నులో వణుకు: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు

Update: 2024-04-18 16:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాముడి పేరు వింటే వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. మేం శ్రీరాముడి భక్తులమని.. వాళ్లకు దమ్ముంటే బాబర్ పేరుతో జనంలోకి వెళ్లాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్నీ కుట్రలు చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు తెలంగాణ, అటు కేంద్రంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ అని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ మూడవ సారి భారత ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. 

Similar News