మరోసారి రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డూ.. ఎంత పలికిందో తెలుసా?

ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేషుడి శోభయాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలో లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభించారు. బాలాపూర్ లడ్డూ వేలం ఘట్టం కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

Update: 2022-09-09 05:09 GMT

దిశ, బడంగ్ పేట్ : ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేషుడి శోభయాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలో లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభించారు. ఈ లడ్డూ వేలం ధర ప్రతి ఏటా పెరుతూ రికార్డు నెలకొల్పుతోంది. తాజాగా.. మరోసారి రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డూ వేలం జరిగింది. ఈసారి 24 లక్షల 60 వేలు పలికింది లడ్డూ ధర. ఈ లడ్డూనూ వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. కాగా, గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అతని స్నేహితుడు మర్రి శశాంక్ రెడ్డిలు కలిసి రూ.18.90లక్షలకు చేక్కించుకున్నారు. అయితే, ఈసారి అంతకుమించి, అందరి అంచనాలు తారుమారు చేసి ఏకంగా వేలం పాటలో 24 లక్షల 60 వేలు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

Also Read : అస్సలు ఊహించరు.. బాలాపూర్‌ మొట్టమొదటి లడ్డూ ధరెంతో తెలుసా?

రికార్డ్ ధర పలికిన బీరంగుడా వినాయకుడి లడ్డు ధర... రూ. 10 లక్షల ఐదు వేలు

Tags:    

Similar News