రాజేంద్రనగర్‌లో చెత్తకుండిలో పసికందు

దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకూ ప్రజల్లో మానవత్వం తగ్గిపోతోంది. నవమాసాలు మో

Update: 2022-04-05 07:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకూ ప్రజల్లో మానవత్వం తగ్గిపోతోంది. నవమాసాలు మోసిన ఓ తల్లి, పుట్టగానే చనిపోయిన పసికందును చెత్తకుప్పలో పడేసిన ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరిగింది. మంగళవారం స్థానికంగా ఉన్న ఓ చెత్తకుండిలో కూరగాయల చెత్త, కవర్లు, పేపర్లతో కలిపి శిశువు మృతదేహాన్ని మూట కట్టినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. శిశువు పుట్టగానే మరణించి ఉంటుందని తెలిపారు. శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News