వ్యభిచార గృహం‌పై దాడి.. నలుగురు నిర్వాహకులు అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని హైదరబాద్ రోడ్‌లో మహా లక్ష్మీ నగర్ లో ఓక ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

Update: 2024-03-13 02:24 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని హైదరబాద్ రోడ్‌లో మహా లక్ష్మీ నగర్ లో ఓక ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారితో పాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రూ.4,400లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి స్థానిక నాలుగో టౌన్ పోలీసులకు అప్పజెప్పినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Similar News