'ముందే సమాచారమిస్తే మా పాపను బతికించుకునేవాళ్లం'

మండలంలోని బాబాపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువతున్న విద్యార్థిని ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది.

Update: 2022-09-27 06:03 GMT

దిశ, చింతలమానేపల్లి: మండలంలోని బాబాపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువతున్న విద్యార్థిని ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబీకులు వివరాల ప్రకారం.. మండలంలోని కోర్సుని గ్రామానికి చెందిన మహేష్-లక్ష్మి దంపతుల కుమార్తె దీపాలి(9) ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. దసర సెలవులకు శుక్రవారం ఇంటికి తీసుకు రావటంతో అప్పటికే తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కాగజ్ నగర్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ జ్వరం తక్కువ కాకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకువెళ్ల క్రమంలో మార్గంమధ్యలో మృతి చెందింది. పాఠశాల సిబ్బంది ముందస్తు సమాచారం ఇస్తే తమ పాపను బతికించుకునేవారమని కుటుంబీకులు వాపోయారు.

Tags:    

Similar News