TSPSC పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్‌లు 100 దాటుతాయ్: CP సీవీ ఆనంద్

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య వంద దాటవచ్చని హైదరాబాద్ ​పోలీస్​ కమిషనర్ ​సీ.వీ.ఆనంద్​ చెప్పారు.

Update: 2023-05-30 16:27 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య వంద దాటవచ్చని హైదరాబాద్ ​పోలీస్​ కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ చెప్పారు. ఈ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. కొందరు అభ్యర్థులు ఎలక్ర్టానిక్ ​డివైస్‌లను ఉపయోగించుకుని పరీక్షలు రాసినట్టుగా దర్యాప్తులో తేలిందన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్​ కంట్రోల్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుకు సంబంధించి ఇప్పటివరకు వేర్వేరు పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వందమందికి పైగా అభ్యర్థులను విచారించినట్టు చెప్పారు. బోర్డులోని కాన్ఫిడెన్షియల్​ రూం నుంచి ఈ ప్రశ్నాపత్రాలను లీక్​చేసిన ప్రవీణ్​కుమార్, రాజశేఖర్​రెడ్డిల చేతుల్లో నుంచి వేర్వేరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. డబ్బు పెట్టి ప్రశ్నాపత్రాలు కొన్నవారు తాము చెల్లించిన నగదును తిరిగి సంపాదించుకునేందుకు మరింత మందికి ప్రశ్నాపత్రాలను అమ్మినట్టుగా తెలిపారు. ఈ కేసులో పాత్ర ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని చెప్పారు.

Tags:    

Similar News