ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. అధికారికంగా పోలీసులు ట్యాపింగ్ కేసును నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ను జత పరుస్తూ మెమో దాఖలు చేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేయగా.. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ కింద మెమో దాఖలు చేయడంతో తదుపరి ఈ కేసులో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.
Read More: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు రిమాండ్