కాంగ్రెస్ ఇంచార్జ్ ఇంటి ముందు ఆందోళన

చేసిన పనికి డబ్బు ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ మునుగోడు జిల్లా ఇంచార్జ్ చల్ల మల్ల కృష్ణారెడ్డి ఇంటి ముందు బుధవారం కూలీలు ఆందోళన జరిపారు.

Update: 2023-05-17 05:58 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: చేసిన పనికి డబ్బు ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ మునుగోడు జిల్లా ఇంచార్జ్ చల్ల మల్ల కృష్ణారెడ్డి ఇంటి ముందు బుధవారం కూలీలు ఆందోళన జరిపారు. కృష్ణారెడ్డి కుమారుడి వివాహం ఈ నెల 6న జరిగింది. ఈ క్రమంలో డెకొరేషన్ చేసిన కూలీలకు కృష్ణారెడ్డి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇదే విషయమై కృష్ణారెడ్డిని కలిసి అడుగగా డబ్బులు ఇవ్వకపోగా రేవంత్ రెడ్డి పేరు చెప్పి భయపెడుతున్నాడని కూలీలు ఆరోపిస్తున్నారు. న్యాయంగా తమకు రావాల్సిన డబ్బు కోసం దిల్‌షుక్‌నగర్ చైతన్యపురిలోని అతని నివాసం ముందు ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు.

Read More:   రెండు పార్టీలకు ఆ పేరే ‘‘అస్త్రం’’.. తమదైన శైలీలో పబ్లిసిటీ చేస్తోన్న కాంగ్రెస్, YSRTP! 

Tags:    

Similar News