యువతి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా..

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో ఓ యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది.

Update: 2022-10-06 15:59 GMT

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా నెన్నల మండల కేంద్రంలో ఓ యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది. నెన్నెల ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణం శంషీర్ నగర్ కు చెందిన సోయం తేజశ్రీ (22) నెన్నెల మండలం లంబాడి తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు.

పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన తేజశ్రీ పురుగుల మందు తాగి ప్రియుడి ఇంటికి బయలుదేరింది. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో నెన్నెల పీఎస్సీకి తీసుకెళ్లారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమెను వెంటనే మంచిర్యాలకు రిఫరల్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి గురువారం మృతి చెందింది. ఈ మేరకు ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News