నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ హెచ్చరించారు.

Update: 2024-05-26 16:11 GMT

దిశ, ఆసిఫాబాద్ : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ హెచ్చరించారు. ఆదివారం కాగజ్ నగర్ డివిజన్ లోని చింతలమానపల్లి మండలం డబ్బా గ్రామం నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నరని వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు దాడులు చేసి 3 క్వింటాళ్ల.. 25 కేజీల నకిలీ పత్తి విత్తనాలు టాస్క్ఫోర్స్ పోలీసులు పెట్టుకున్నారు. దాని విలువ సుమారు రూ. 8.12 లక్షలు ఉంటుందని తెలిపారు. చింతలమానపల్లి గంగపూర్ కు చెందిన పురుషోత్తం, సిర్పూర్ టీ భూపాలపట్నం గ్రామానికి చెందిన బొల్లబోయోన అశోక్ పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ వీ.మధు, పీ. రమేష్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

Similar News