ప్రజా సమికరణ ప్రచార రథాలను ప్రారంభించిన ఎంపీ..

ఈ నెల 28వ తేదీన ముధోల్ నియోజకవర్గం భైంసా నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టబోయే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రజా సమీకరణకు ముధోల్ నియోజకవర్గ నాయకులు సర్వం సిద్ధం చేస్తున్నారు.. Latest Telugu News

Update: 2022-11-26 09:23 GMT

దిశ, భైంసా: ఈ నెల 28వ తేదీన ముధోల్ నియోజకవర్గం భైంసా నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టబోయే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రజా సమీకరణకు ముధోల్ నియోజకవర్గ నాయకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పట్టణంలోని దారబ్జి జిన్నింగ్ మిల్లులో ప్రజా సమీకరణకు సంబంధించి ప్రచార రథాలను ఎంపీ సొయం బాపురావు, భోస్లే మోహన్ రావు పటేల్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రచారానికి సంబంధించి ప్రచార రథాల వారికి పలు సలహా, సూచనలు ఇచ్చారు.

Tags:    

Similar News