సీఎం సభ మైదానాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 22న ఎన్నికల ప్రచారం లో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ గ్రౌండ్ లో సీయం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్న సభా స్థలాన్ని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క సందర్శించి పరిశీలించారు.
దిశ,ఆదిలాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 22న ఎన్నికల ప్రచారం లో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ గ్రౌండ్ లో సీయం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్న సభా స్థలాన్ని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క సందర్శించి పరిశీలించారు. ప్రధాన వేదిక, జనం ప్రవేశించే మార్గాలు తదితర విషయాలను నియోజకవర్గ ఇంఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 21 సాయంత్రం లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
ప్రస్తుత ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సభ విజయవంతమయ్యేలా ఇంఛార్జీలకు పలు సూచనలు చేశారు. సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ,టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేష్, డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, రేఖానాయక్ ,నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావు,ఆదిలాబాద్ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ,బోథ్ ఇంఛార్జి ఆడె గజేందర్, ఆసిఫాబాద్ ఇంఛార్జి శ్యాం నాయక్,ఎన్ ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు శంతన్ రావు, ఎన్ఎస్ యూఐ నాయకులు , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.