కార్మికుల సంక్షేమమే సింగరేణి సంస్థ లక్ష్యం - డైరెక్టర్ బలరాం నాయక్

సింగరేణి ఉత్పత్తితోపాటు కార్మికుల సంక్షేమం కూడా ముఖ్యమని డైరెక్టర్ బలరాం నాయక్ అన్నారు.

Update: 2022-10-02 12:49 GMT

దిశ, రామకృష్ణాపూర్ : సింగరేణి ఉత్పత్తితోపాటు కార్మికుల సంక్షేమం కూడా ముఖ్యమని డైరెక్టర్ బలరాం నాయక్ అన్నారు. కోల్ బెల్ట్ రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఫిజియోథెరపీ సెంటర్ ను సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం నాయక్, మందమర్రి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు.

అనంతరం పట్టణంలోని స్థానిక సింగరేణి ఠాగూర్ క్రీడా మైదానన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ సీతారామయ్య, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, ఎస్ఓటుజిఎం కృష్ణారావు, డీవైసీఎం డాక్టర్ ఉషా, డీవైపీఎం శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News