ఫారెస్ట్ అధికారులపై పోడు దారుల దాడి..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామ సమీపంలో

Update: 2024-05-10 13:24 GMT

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామ సమీపంలో అటవీ శాఖ అధికారులు, పొడు దారులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం తుంగెడ గ్రామానికి చెందిన కొందరు అక్రమంగా కొత్త పోడు చేస్తున్న వారిని అడ్డుకోవడానికి వెళ్లిన అటవీ అధికారులు పై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా స్థానికులతో పాటు గ్రామస్థులు ఏకమై అధికారులతో వాగ్వాదం దిగారు. కొందరు గొడ్డళ్లు. కర్రలు. రాళ్ళతో తమపై దాడికి యత్నించగా తప్పించుకున్నట్లు అటవీ శాఖ అధికారులు ఆరోపించారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయొద్దని. కలెక్టర్. తహసీల్దార్ లో సమక్షంలో అటవీ సరిహద్దు సర్వే తర్వాత చేయొచ్చు అని వారం రోజుల క్రితమే వారికి చెప్పినా పట్టించుకోకుండా. కొత్త పోడు చేస్తున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన తమపై దాడికి దిగారని అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగెడ పోడుదారులు మాత్రం గత 30 ఏళ్లుగా ఈ భూములను సాగు వస్తున్నామని. భూములకు సంబంధించిన పట్టాలు సైతం ఉన్నాయని చెప్పారు. కరువు కారణంగా కొన్నేళ్లుగా సాగు చేయకుండా వలస వెళ్లాము. ఇప్పుడు సాగు చేస్తుంటే అటవీ భూములు సాగు చేయొద్దని ఫారెస్ట్ అధికారులు తమ పై ధ్వజంగా దాడికి పాల్పడి తమను గాయపరిచారని ఆరోపించారు. కలెక్టర్ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని తుంగెడ పోడుదారులు కోరుతున్నారు. ఘర్షణ విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్వో అప్పల కొండ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో నలుగురు బీట్ ఆఫీసర్లు. ఇద్దరు ఎఫ్ఎస్ వోలు గాయపడగా ఆస్పత్రిలో చేర్పించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News