డా.వేణుగోపాల కృష్ణకు ఘన సన్మానం

నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ఎంవోగా సేవలందిస్తున్న డాక్టర్ వేణుగోపాల కృష్ణను ఘనంగా సన్మానించారు.

Update: 2023-02-19 05:39 GMT

దిశ, నిర్మల్ రూరల్: నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ఎంవోగా సేవలందిస్తున్న డాక్టర్ వేణుగోపాల కృష్ణను ఘనంగా సన్మానించారు. డాక్టర్ వేణుగోపాల కృష్ణ ఎలాంటి ప్రైవేట్ ప్రాక్టీస్ లేకుండా ఓ ప్రభుత్వ డాక్టర్ గా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నారు. పోస్టుమార్టం కేసులకు అందుబాటులో ఉంటూ కేసుల పరిష్కారంలో పోలీసులకు సహాయ సహకరాలందిస్తూ ఉత్తమ వైద్యాధికారిగా ప్రశంసలు పొందారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పలు కేంద్ర, రాష్ట్ర అవార్డులు వరించాయి.

ఈ సందర్భంగా జడ్పీ పర్సన్ విజయలక్మి, రాంకిషన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News